-
విజయం కోసం వంద శాతం కష్టపడ్డా
సెమీఫైనల్లో విజయం కోసం వంద శాతం కష్టపడ్డాను. కానీ తుది ఫలితం నిరాశపరిచింది. క్రీడాకారుల కెరీర్లో గెలుపోటములు సహజమే. మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. మూడు గేమ్లు ఆడటం సులువేమీ కాదు. ఇలాంటి మ్యాచ్ల్లో రెండు, మూడు పాయింట్లే ఫలితాన్ని శాసిస్తాయి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీతో నేనెంతో నేర్చుకున్నాను. ఈ సీజన్లోని తదుపరి టోర్నమెంట్లలో మరింత మెరుగ్గా రాణించేందుకు శ్రమిస్తాను. – ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీస్లో ఓటమిపై సింధు -
పరాజయం అంచుల నుంచి...
బర్మింగ్హామ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలి రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో మాజీ రన్నరప్ సైనానెహ్వాల్... పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు మూడు గేమ్లపాటు కష్టపడి గట్టెక్కారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో 58 నిమిషాలపాటు జరిగిన జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 7–21, 21–14, 22–20తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ 19–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. ఈ స్కోరు వద్ద లెవెర్డెజ్ మరో పాయింట్ సాధించి ఉంటే శ్రీకాంత్కు ఓటమి ఎదురయ్యేది. కానీ కీలకదశలో శ్రీకాంత్ సంయమనం కోల్పోకుండా ఆడి పాయింట్ సాధించి స్కోరును 20–20తో సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. మరో మ్యాచ్లో సాయిప్రణీత్ 21–13, 15–21, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2015 రన్నరప్ సైనా నెహ్వాల్ 14–21, 18–21తో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. తై జు చేతిలో సైనాకిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. 2009 తర్వాత ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా తొలి రౌండ్లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్లో సింధు 56 నిమిషాల్లో 20–22, 21–17, 21–9తో పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి గేమ్ను కోల్పోయిన సింధు ఆ తర్వాత కోలుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14–21, 13–21తో మత్సుతోమో–తకహాషి (జపాన్) జోడీ చేతిలో... మేఘన–పూర్వీషా (భారత్) ద్వయం 14–21, 11–21తో షిహో తనకా–యోనోమోటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 20–22, 12–21తో మార్కస్ ఎలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–19, 21–13తో మార్విన్–లిండా (జర్మనీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. -
‘ఆల్ ఇంగ్లండ్’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్
హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ టోర్నీ’కి ఆయన భారత జట్టు తరఫున పరిశీలకుడిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చాముండికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మెగా టోర్నమెంట్లో భారత్ నుంచి 11 మంది షట్లర్లు పాల్గొంటున్నారు. మార్చి 7 నుంచి 12 వరకు బర్మింగ్హామ్లో ఈ టోర్నీ జరుగుతుంది. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన చాముండి ప్రస్తుతం హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంగ్లండ్లోనే జరిగిన 2009 టి20 క్రికెట్ ప్రపంచ కప్లో భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement