22 పరుగులకే మూడు వికెట్లు

27 Jan, 2018 17:03 IST|Sakshi

ఢాకా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. శ్రీలంక నిర్దేశించిన 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లా ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌(3), మొహ్మద్‌ మిథున్‌(10), షబ్బీర్‌ రెహ్మాన్‌(2)లు తీవ్రంగా నిరాశపరిచారు.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంకేయులు నిర్ణీత 50 ఓ‍వర్లలో 221 పరుగులకు ఆలౌటయ్యారు. ఉపుల్‌ తరంగా(56), కుశాల్‌ మెండిస్‌(28), నిరోషన్‌ డిక్వెల్లా(42), దినేశ్‌ చండిమాల్‌(45)లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచారు.

మరిన్ని వార్తలు