-

జెపూర్‌పై గుజరాత్‌ గెలుపు

14 Aug, 2017 01:02 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్‌ ఫార్చున్‌ జెయింట్స్‌ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్‌ 27–20తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. గుజరాత్‌ తరఫున సచిన్‌ (7), మిఘని (4), ఫజెల్‌ (4) రాణించారు.

పట్నా పైరేట్స్, యూపీ యోధ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 27–27తో టైగా ముగిసింది. నేడు లీగ్‌కు విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే పోటీల్లో బెంగాల్‌ వారియర్స్‌తో పుణేరి పల్టన్, గుజరాత్‌ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి. 

మరిన్ని వార్తలు