హరికృష్ణకు ఏడో స్థానం

1 May, 2016 01:58 IST|Sakshi

స్టావెంజర్: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ 4.5 పాయింట్లు సంపాదించాడు.

ప్రపంచ ఏడో ర్యాంకర్ అరోనియన్ (అర్మేనియా)తో చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో తలపడిన హరికృష్ణ 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఆరు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు.

మరిన్ని వార్తలు