ముంబై: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 29న ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నాగ్పూర్లో సమావేశం కానుంది.
ఆస్ట్రేలియాతో ఆరో వన్డే (ఈనెల 30న)కు ఒక్క రోజు ముందు ఈ సమావేశం జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విండీస్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 6 నుంచి 10 వరకు ఈడెన్ గార్డెన్స్లో; రెండో మ్యాచ్ 14 నుంచి 18 వరకు వాంఖడేలో జరుగుతాయి.