మొహాలి: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం మొహాలిలో రెండో వన్డే మ్యాచ్ లో తలపడనున్న టీమిండియా చండీగఢ్కు చేరుకుంది. సోమవారం భారత క్రికెట్ సభ్యులు చండీగఢ్లో అడుగుపెట్టారు. తొలి వన్డేలో ఘోర ఓటమి పాలైన భారత జట్టు.. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. దానిలో భాగంగా ముందుగానే ఇక్కడకి చేరుకున్న టీమిండియా తమ వ్యూహానికి పదునుపెట్టనుంది. మొహాలీలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది.