క్రికెట్‌లో కొత్త రూల్‌.. రేపటి నుంచే అమల్లోకి..!

11 Dec, 2023 16:36 IST|Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ).. డిసెంబర్‌ 12 నుంచి పొట్టి ఫార్మాట్‌లో కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. విండీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నుంచి ఐసీసీ "స్టాప్‌ క్లాక్‌" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్‌ క్లాక్‌ రూల్‌ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది. 

స్టాప్‌ క్లాక్‌ నిబంధన ఏంటంటే..
పరిమిత​ ఓవర్ల క్రికెట్‌లో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్‌ టైమ్‌గా ఫిక్స్‌ చేసింది. బౌలింగ్‌ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

ఈ పరుగులు బ్యాటింగ్‌ టీమ్‌ స్కోర్‌కు యాడ్‌ అవుతాయి. ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్‌ 21న అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

>
మరిన్ని వార్తలు