న్యూఢిల్లీ: అంతర్జాతీయ జూనియర్ షాట్గన్ చాంపియన్షిప్లో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. ఫిన్లాండ్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో ‘డబుల్ ట్రాప్’ వ్యక్తిగత విభాగంలో ప్రియాన్షు పాండే స్వర్ణ పతకం సాధించాడు.
క్వాలిఫయింగ్లో 102 పాయింట్లు స్కోరు చేసిన ప్రియాన్షు సెమీఫైనల్లో 24, ఫైనల్లో 23 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టీమ్ విభాగంలో సంజయ్ రాథోడ్, అహవర్ రిజ్వీ, ప్రియాన్షులతో కూడిన బృందం రజత పతకం దక్కించుకుంది.