భజరంగ్, లలితకు రజత పతకాలు

30 Jul, 2014 21:35 IST|Sakshi

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు పతకాల 'పట్టు'పడుతున్నారు. బుధవారం రెజ్లింగ్లో భారత్కు మరో రెందు పతకాలు దక్కాయి. మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు.

కాగా వీరిద్దరూ  అడుగు దూరంలో పసిడి పతకం చేజార్చుకున్నారు. ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్ ఓటమి చవిచూశారు. మరో ఇద్దరు భారత రెజ్లర్లు ఫైనల్స్కు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నారు. పోటీలు కాసేపట్లో జరగనున్నాయి. కాంస్య పతకం పోరులో మరో భారత రెజ్లర్ పోటీ పడుతోంది.

మరిన్ని వార్తలు