'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'

30 Oct, 2014 17:54 IST|Sakshi
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'
చెన్నై: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఐసీసీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ధోని ఒకరు అని శ్రీనివాసన్ అన్నారు. ఇండియా సిమెంట్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ క్రికెట్ రంగంపై ఎంఎస్ ధోని ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన తెలిపారు. 
 
ధోని గొప్ప క్రికెటర్, భారత జట్టును ముందుకు నడిపించడంలో ఆయన వ్యూహాలు అమోఘమన్నారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో ఐసీసీ ప్రపంచ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలతోపాటు అన్ని ప్రధాన టోర్నిల్లో భారత్ కు విజయాన్ని అందించారని శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ రంగానికి ఇండియా సిమెంట్స్ ఎనలేని కృషి చేసిందని, ఎందరో క్రికెటర్ల భవిష్యత్ ను తీర్చిదిద్దందని శ్రీనివాసన్ తెలిపారు. 
మరిన్ని వార్తలు