-
ఠాకూర్పై కోర్టుకెక్కిన శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ తరఫున తనపై దాఖలు చేసిన పిటిషన్లో బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుడు సమాచారం ఇచ్చారని... దీనిపై ఆయనను విచారించాలని మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కోర్టుకెక్కారు. తన గురించి వివరాలు ఇచ్చిన అఫిడవిట్ అంతా అబద్ధాలమయమని, అందులో రాసిన అంశాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని శ్రీనివాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసన్ బోర్డు సమావేశాలకు హాజరు కావచ్చా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని ఠాకూర్ ఈ నెల 11న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కాకుండా బోర్డు నియమావళిలోని 6.2.4 నిబంధనను మార్చిన సమయంలో ఉండి నాడు వ్యతిరేకించని ఠాకూర్, ఇప్పుడే అదే అంశంతో కోర్టుకెక్కడం అర్థం లేనిదని శ్రీని అన్నారు. గత నెల 28న వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో తాను లోపలికి దూసుకొచ్చి బలవంతం చేశాననే ఆరోపణలు ఆయన కొట్టివేశారు. తనపై వ్యక్తిగత కక్ష్యతో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఠాకూర్పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. -
జోరుగా మంతనాలు
ఆసక్తికరంగా బీసీసీఐ అధ్యక్ష ఎన్నిక న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టిన రెండు వర్గాలు తమ తరహాలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ శుక్రవారం కొంత మంది తన మద్దతుదారులతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఈస్ట్జోన్ సంఘాల ప్రతినిధులతో కూడా మాట్లాడేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించినా వారెవరూ ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. అమితాబ్ చౌదరికి మద్దతిచ్చే అవకాశాన్ని శ్రీని కొట్టిపారేయలేదు. మరో వైపు గురువారం నాగపూర్లో పవార్తో జరిగిన సమావేశంలో కూడా ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. పవార్కు సంబంధించి నాలుగు ఓట్లు ఉండటంతో ఆయనతో శ్రీనివాసన్ చర్చించినా ఎలాంటి హామీ దక్కలేదు. పవార్ కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తితో ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. అటు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా రాజీవ్ శుక్లాకు మద్దతుగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
బీసీసీఐ పిటిషన్ పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: బీసీసీఐ అధికార సమావేశాలకు మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ హాజరు కావొచ్చా?లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకారం తెలిపింది. అయితే విచారణ చేపట్టే కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ రోజు బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్ టీఎస్ థాకూర్.. త్వరలో బీసీసీఐ తరుపు వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లు అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ కు స్పష్టం చేశారు. శ్రీనివాసన్ అంశంపై స్పష్టత రానందున ఈనెల 27న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. బోర్డు సమావేశానికి తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ఎన్. శ్రీనివాసన్ హాజరు కావొచ్చా? లేదా అనేది తేలే వరకు ఈ సమావేశం జరిగే అవకాశం లేదని.. కోర్టు ఆదేశాల తర్వాత ఏజీఎంను నిర్వహిస్తామని కార్యదర్శి ఠాకూర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే బీసీసీఐ సెప్టెంబర్ 12 వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
'బీసీసీఐ మీటింగ్లకు ఆయన హాజరుకావచ్చా?'
ముంబయి : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించాల్సి వచ్చింది. బీసీసీఐ అధికారిక సమావేశాలకు శ్రీని హాజరు కావచ్చా.. లేదా అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే. -
శ్రీనివాసన్ రాకతో...
కోల్కతా: భారత క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే దీనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కావడమే దీనికి కారణం. శ్రీనివాసన్ దీనికి హాజరు కావొచ్చా లేదా అనేదానిపై తాము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుతం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో గతంలో బోర్డు అధ్యక్షుడిగా శ్రీనివాసన్ పోటీ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆయన ఈ సమావేశానికి ఎలా వస్తారని కొందరు సభ్యులు వాదించడంతో వివాదం చోటు చేసుకుంది. అయితే జస్టిస్ శ్రీకృష్ణ అభిప్రాయం ప్రకారం తనకా హక్కు ఉందని శ్రీనివాసన్ తన రాకను సమర్థించుకున్నారు. దీనిపై మరింత వాదన జరగడంతో వర్కింగ్ కమిటీ సమావేశాన్ని రద్దు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో బోర్డు మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లోధా కమిటీ సిఫారసులపై చర్చ, వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే జట్లపై నిర్ణయం, జాతీయ క్రికెట్ అకాడమీ తరలింపు, భారత జట్టు కోచ్ ఎంపిక తదితర అంశాలు ఈ సమావేశం అజెండాలో ఉన్నాయి. మరో వైపు వార్షిక అకౌంట్ల ఆమోదం మినహా బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో కూడా ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నవాబుల అరాచకలు గుర్తులేవా..? ప్రధాని మోదీ
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement