హైదరాబాద్ కెప్టెన్‌గా నితీశ్ రెడ్డి

27 Oct, 2016 10:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రకటించింది. నవంబర్ 5న ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. కె. నితీశ్ రెడ్డి కెప్టెన్‌గా... చందన్ సహాని వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టుకు అబ్దుల్ వహాబ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

 జట్టు: కె. నితీశ్ రెడ్డి (కెప్టెన్), జీవీ వినీత్, చందన్ సహాని (వైస్ కెప్టెన్), కె. భగత్ వర్మ, అలంకృత్ అగర్వాల్, అమ్మార్ ఆయూబ్, నిలేశ్, అజయ్ దేవ్, రాజమణి ప్రసాద్, అజర్ అలీ (వికెట్ కీపర్), షేక్ సొహైల్, రిషబ్, టి. సంతోష్, ప్రణీత్ రాజ్, సారుు వికాస్, సయ్యద్ హుస్సేన్ (వికెట్ కీపర్).


 

మరిన్ని వార్తలు