మెల్బోర్న్ : డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి గొడవలు లేవని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీమిండియా సభ్యులంతా ఫ్రెండ్లీగా ఉంటున్నారని...ఆల్ ఈజ్ వెల్ అంటూ చెప్పుకొచ్చాడు. క్రికెటర్లకు విశ్రాంతి లేదనటం సరికాదని ధోని పేర్కొన్నాడు. డ్రస్సింగ్ రూమ్లో కోహ్లీ, థావన్ మధ్య గొడవ జరిగిందన్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. కాగా జాతీయ మీడియా కథనం ప్రకారం బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ మధ్య గొడవ జరిగిందని సమాచారం. అయితే దీనిపై టీమ్ మేనేజిమెంట్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.