ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: హెచ్బీసీసీ బ్యాట్స్మెన్ ప్రిన్స్ ఓజా (97 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అద్భుతంగా రాణించాడు. దీంతో ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్లో సలీమ్నగర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హెచ్బీసీసీ 36.3 ఓవర్లలో 8 వికెట్లకు 184పరుగులు చేసి ఇన్నింగ్సను డిక్లేర్డ్ చేసింది. దీపాంకర్ (53) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సలీమ్నగర్ బౌలర్లలో సూర్యప్రకాశ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సలీమ్నగర్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అపెక్స్ సీసీతో జరిగిన మరో మ్యాచ్లో రోహిత్ ఎలెవన్ జట్టు 23 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం ఆటంకం కలిగించడంతో ఆటను నిలిపివేశారు.
ఇతర మ్యాచ్ల ఫలితాలు
నిజాం కాలేజ్: 114/5 (అన్వేష్ రెడ్డి 30 బ్యాటింగ్); నేషనల్ సీసీతో మ్యాచ్.
అగర్వాల్ సీనియర్: 117 (ముర్తజా అహ్మద్ 5/61), అబ్దుల్ వహీద్ 3/18); గుజరాత్ టర్ఫ్: 124/3 (సయ్యద్ షాబాజుద్దీన్ 78).
డెక్కన్ బ్లూస్: 125 (జార్జ్ హేస్టీ 52; ప్రణయ్ కుమార్ 4/34, అబిద్ 6/25); బాలాజీ కోల్ట్స్తో మ్యాచ్.
ఫ్యూచర్ స్టార్: 91/4 (యశ్వంత్ రాజ్ 51 బ్యాటింగ్; విజయ్ వర్మ 3/4); ఎంసీసీతో మ్యాచ్.