న్యూఢిల్లీ: ఈనెల 15 నుంచి ఇంగ్లండ్లో పర్యటించే భారత అండర్–19 జట్టుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరం కానున్నారు. ఇదే నెలలోనే భారత్ ‘ఎ’ జట్టు కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లకు మరో రెండేళ్ల పాటు ద్రవిడ్ను కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనలో భారత్ ‘ఎ’ రెండు నాలుగు రోజుల మ్యాచ్లతో పాటు ముక్కోణపు వన్డే టోర్నీలో తలపడనుంది. దీంతో ద్రవిడ్ భారత్ ‘ఎ’ జట్టుతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.