అండర్‌–19 పర్యటనకు కోచ్‌ ద్రవిడ్‌ దూరం

5 Jul, 2017 03:14 IST|Sakshi
అండర్‌–19 పర్యటనకు కోచ్‌ ద్రవిడ్‌ దూరం

న్యూఢిల్లీ: ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించే భారత అండర్‌–19 జట్టుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దూరం కానున్నారు. ఇదే నెలలోనే భారత్‌ ‘ఎ’ జట్టు కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లకు మరో రెండేళ్ల పాటు ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనలో భారత్‌ ‘ఎ’ రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లతో పాటు ముక్కోణపు వన్డే టోర్నీలో తలపడనుంది. దీంతో ద్రవిడ్‌ భారత్‌ ‘ఎ’ జట్టుతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు