రన్నరప్ బోపన్న-మెర్జియా జోడీ

22 Jun, 2015 01:16 IST|Sakshi

హాలె (జర్మనీ): వరుసగా రెండో వారం మరో టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు నిరాశ ఎదురైంది. గెర్రీ వెబెర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో బోపన్న-మెర్జియా జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 2-6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. మరోవైపు లండన్‌లో జరిగిన ఎగాన్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-నెస్టర్ (కెనడా) జోడీ సెమీఫైనల్లో 3-6, 6-7 (8/10)తో జిమోనిచ్ (సెర్బియా)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.
 

మరిన్ని వార్తలు