సెమీస్‌లో సాయి దేదీప్య

23 Dec, 2016 11:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య 6-0, 6-2తో మల్లిక (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో దేదీప్య మహారాష్ట్రకే చెందిన పూజతో తలపడుతుంది.


 

మరిన్ని వార్తలు