పాక్ జట్టుకు సక్లైన్ గుబులు!

29 Mar, 2014 17:27 IST|Sakshi

కరాచీ: పాకిస్థాన్ జట్టులో స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ రూపంలో కొత్త గుబులు మొదలైంది. ప్రపంచకప్ టీ20 టోర్నమెంట్ లో సెమీఫైనల్ బెర్త్ తో పోటీ పడనున్న తరుణంలో పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ స్పిన్నర్ ఆ జట్టులో అశాంతి నింపాడు. సక్లైన్ ముస్తాక్ గురించి పాక్ జట్టు ఎందుకు గాబరా పడుతుందటే.. వెస్టిండీస్ జట్టులో స్పిన్ కోచ్ సేవలందిస్తున్నాడు.

సక్లైన్ రాకతో బౌలింగ్ పటిష్టంగా మారడంతోపాటు శ్యామ్యూల్ బాద్రీ, సునీల్ నరైన్ లు ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తున్నారు. పాక్ జట్టు ఆటగాళ్ల బలహీనతల్ని దృష్టిలో ఉంచుకుని సక్లైన్ బద్రీ, నరైన్ లతో కలిసి వ్యూహం రచిస్తున్నారు. ఎలాగైనా పాక్ పై విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనే కృత నిశ్చయంతో విండీస్ ప్రణాళిక రచిస్తోంది. సక్లైన్ అండతో విండీస్ విజయం సాధిస్తో లేదో వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు