సెమీస్‌లో సానియా జోడీ

22 Apr, 2016 00:45 IST|Sakshi

స్టట్‌గార్ట్ (జర్మనీ):  పోర్షె టెన్నిస్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-1, 6-3తో బార్బరా క్రెజిసికోవా-కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ 6-1, 6-1తో ఎరి హొజుమి-మియు కాటో (జపాన్)లపై గెలిచారు.


 మరోవైపు బార్సిలోనా ఓపెన్ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జోడీ 6-7 (5/7), 4-6తో ట్రీట్ హువె (ఫిలిప్పీన్స్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంట చేతిలో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు