జట్టులో నల్లజాతీయులేరీ!

26 Apr, 2016 01:10 IST|Sakshi

దక్షిణాఫ్రికా బోర్డుకు ప్రభుత్వ శిక్ష

కేప్‌టౌన్: జాతీయ క్రికెట్ జట్టులో ఎక్కువ మంది నల్ల జాతివారికి అవకాశం ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధనను తగిన రీతిలో అమలుపరచనందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును ప్రభుత్వం శిక్షించింది. రాబోయే రోజుల్లో దక్షిణాఫ్రికా ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వకుండా, టోర్నీ నిర్వహణ కోసం బిడ్ వేయకుండా ఆ దేశ క్రీడా మంత్రి ఫికిల్ ఎంబులా నిషేధం విధించారు. ఏడాది క్రితం అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం జాతీయ జట్టులో కనీసం 60 శాతం మంది నల్లజాతివారు ఉండాలి.

>
మరిన్ని వార్తలు