భారత జట్టు ఎంపిక 20న

16 May, 2015 02:14 IST|Sakshi

 ముంబై : వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 20న జరుగనుంది. ఒక టెస్టు, మూడు వన్డేల కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించనుంది. జూన్ 10 నుంచి 14 వరకు ఫతుల్లాలో టెస్టు, 18 నుంచి 24 వరకు మిర్పూర్‌లో వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే ఈ పర్యటన నుంచి తమను తప్పించాలంటూ కోహ్లి సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు బోర్డును కోరినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు