కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు సెహ్వాగ్‌ గుడ్‌బై 

4 Nov, 2018 03:20 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చే సీజన్‌లో తాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కుమెంటార్‌గా వ్యవహరించడం లేదని వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రకటించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతో తెగదెంపులు చేసుకున్నట్లు శనివారం తెలిపాడు. 2014, 2015లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ తర్వాత మూడు సీజన్‌లుగా మెంటార్‌ పాత్ర పోషించాడు. ఇటీవలే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ న్యూజిలాండ్‌ జాతీయ జట్టు మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించింది. 

మరిన్ని వార్తలు