వసీమ్ జాఫర్ రికార్డు

9 Nov, 2015 00:11 IST|Sakshi
వసీమ్ జాఫర్ రికార్డు

రంజీల్లో 10 వేల పరుగులు పూర్తి

కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అరుదైన ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాఫర్... ప్రస్తుతం విదర్భ జట్టు తరఫున ఆడుతున్నాడు. బెంగాల్ జట్టుతో ఇక్కడ జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆట రెండో రోజు సందర్భంగా 37 ఏళ్ల జాఫర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

1996-97 సీజన్‌లో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన జాఫర్ ఇప్పటివరకు 126 మ్యాచ్‌లు ఆడి 10,002 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 229 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 51 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 17,088 పరుగులు చేశాడు.
 
 

మరిన్ని వార్తలు