- పోలీసుల వేధింపులే కారణమంటూ బంధువుల ఆందోళన
నారాయణఖేడ్: పోలీసుల వేధింపులు భరించలేక శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మం డలం సంజీవన్రావుపేటకు చెందిన సుంకె పోచయ్య(30), అదే గ్రామానికి చెందిన రత్నాగౌడ్కు చెందిన పదెకరాలను కౌలుకు తీసుకున్నాడు. వారం క్రితం రత్నాగౌడ్ ఇంట్లో చోరీ జరిగింది.
గురువారం పోచయ్యతోపాటు మరో ఐదుగురిని పోలీసులు తమ శైలిలో విచారణ జరిపారు. రాత్రి ఇంటికి వెళ్లిన పోచయ్య ఉరేసుకున్నాడు. దీంతో అతడి బంధువులు శుక్రవారం రత్నాగౌడ్ ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. రైతు ఆత్మహత్యగా నమోదు చేయించడంతో వారు శాంతించారు.