సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు

8 Jul, 2015 12:45 IST|Sakshi
సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్పై తీర్పును కోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే కేసులో సండ్ర బెయిల్ పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేసింది.  బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ను విచారించింది.

ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కౌంటర్ పిటిషన్ను దాఖలు చేసింది.

>
మరిన్ని వార్తలు