ఎట్టకేలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

13 Nov, 2018 11:16 IST|Sakshi

 తొలిజాబితాలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడుగురికి చోటు

 పెండింగ్‌లో మరో ఐదు స్థానాలు

వీరయ్యకు భద్రాచలం కేటాయింపు

సాక్షి వరంగల్‌ : ఎట్టకేలకు కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదలైంది. ఏఐసీసీ సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన 65 మంది అభ్యర్థుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఏడుగురికి అవకాశం దక్కింది. ఇంకా ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించని స్థానాల్లో వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు ఉన్నాయి. ములుగు మాజీ ఎమ్మెల్యే
పొదెం వీరయ్యకు భద్రాచలం కేటాయించారు.
అభ్యర్థులు వీరే... 

  • పరకాల – కొండా సురేఖ
  • నర్సంపేట– దొంతి మాధవరెడ్డి
  • పాలకుర్తి– జంగా రాఘవరెడ్డి
  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ – సింగపురం ఇందిర 
  • డోర్నకల్‌ – రామచంద్రు నాయక్‌ 
  • మహబూబాబాద్‌ – పోరిక బలరాం నాయక్‌
  • ములుగు – సీతక్క 

 

మరిన్ని వార్తలు