హెడ్కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం

29 Jan, 2015 21:11 IST|Sakshi

మెదక్: జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్లో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్ అనే హెడ్కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం బయటపడింది. బాలిక శరీరంపై గాయాలు ఉన్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు.

బాలిక విషయమై జాకీర్ కుటుంబాన్ని పోలీసులు ఆరాతీశారు. మియాపూర్ పోలీసు స్టేషన్లో జాకీర్ హుస్సేన్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అయితే బాలిక మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా,   ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు