హైపవర్‌ విద్యుత్‌ తీగలు పట్టుకుని వ‍్యక్తి మృతి

16 Dec, 2017 10:52 IST|Sakshi

సాక్షి, నెక్కొండ : హైపవర్‌ విద్యుత్‌ తీగలు పట్టుకున‍్నవ‍్యక్తి మృతి చెందిన సంఘటన నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఆగిఉన‍్న ఆయిల్‌ ట్యాంకర్‌పైకి గుర్తు తెలియని 40 సంవత‍్సరాల వ‍్యక్తి ఎక్కాడు. అతడు హైపవర్‌ విద్యుత్‌ తీగలను పట్టుకోవడంతో కరెంట్‌ షాక్‌కు గురై అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున‍్న వరంగల్‌ రైల్వే పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి పంచనామా నిర‍్వహించారు. అనంతరం మృతదేహాన్ని వరంగల్‌ ప్రభుత‍్వ ఆస‍్పత్రి మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు