ఈ నెల 18న ‘సాక్షి మాక్ ఎంసెట్’

10 Apr, 2016 03:32 IST|Sakshi
ఈ నెల 18న ‘సాక్షి మాక్ ఎంసెట్’

15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, వారి ప్రతిభకు మరింత పదనుపెట్టేందుకు ‘సాక్షి మీడియా’ గ్రూప్ ‘మాక్ ఎంసెట్-2016’ నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది.  సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మాక్ ఎంసెట్‌కు సెంచూరియన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్న  మాక్ ఎంసెట్ పరీక్షకు ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరూ హాజరుకావచ్చు. ఆసక్తి గల విద్యార్థులు రూ.100 చెల్లించి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులకు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జత చేసి వెంటనే హాల్‌టికెట్ తీసుకోవచ్చు.

ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టాప్-3 ర్యాంకులు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఇంటర్మీడియెట్ కళాశాలల నిర్వాహకులు ఏకమొత్తంగా మాక్ ఎంసెట్‌కు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకో వాలని నిర్వాహకు లు సూచించారు.   
 
దరఖాస్తు ఫారాల కోసం సంప్రదించాల్సిన చిరునామా
ఇంటి నం. 1-6-69/అ, సుభాష్‌నగర్, తెలంగాణ చౌరస్తా దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, మహబూబ్‌నగర్ - 509001, ఫోన్ : 9705444104, 9618525212
 
పరీక్ష కేంద్రం :
స్వామి వివేకానంద డిగ్రీ - పీజీ కళాశాల, మహబూబ్‌నగర్

మరిన్ని వార్తలు