అవయవదానంలోనూ ‘ఎర్రవల్లి’ స్ఫూర్తి 

18 Feb, 2019 03:40 IST|Sakshi

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో 35 మంది అవయవదానానికి ముందుకొచ్చారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌ భాగ్యభిక్షపతి ఆధ్వర్యంలో మొత్తం 35 మంది యువకులు, మహిళలు కలిసి అవయవదానాలు చేస్తామని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఎర్రవల్లిని బంగారువల్లిగా మార్చారని, అందుకు కృతజ్ఞతగా తాము అవయవదానం చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ భాగ్య, వీడీసీ సభ్యులు బాల్‌రాజు, కరుణాకర్‌రెడ్డి, నవీన్, శ్రీశైలం, దాసు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు