లోక్సభలో యుద్ధవాతావరణం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం
-
బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ మూజువాణి పద్ధతిలో అనుమతి తీసుకున్నారు.
-
సభ్యుల ఆందోళనల మధ్యే షిండే పొడిపొడిగా బిల్లును చదివారు. ఆ తతంగం క్షణాల్లోనే ముగిసింది.
-
ఇంతలో స్పీకర్ పోడియం వద్ద ఒక్కసారిగా యుద్ధవాతావరణం వాతావరణం నెలకొంది.
-
స్పీకర్ వద్ద మైకులను తొలగించేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు తెలంగాణ ఎంపీలు కలబడ్డారు.
-
ఇరు ప్రాంత ఎంపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది. ఈలోగా లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు.
-
ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ పరుగులు తీశారు.
-
లోక్సభ సెక్రటరీ బల్లపై ఉన్న ఫైళ్లను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చిందరవందరగా చేశారు.
-
తెలంగాణ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలపై పిడిగుద్దులు కురిపించారు.
-
వెంటనే స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు.
-
తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్టేనని లోక్సభ అధికారులు తెలిపారు.
-
లోక్సభలో ఘర్షణకు దిగిన ఎంపీలపై చర్యలు ఉంటాయని ఆ తర్వాత హోం మంత్రి షిండే తెలిపారు.
-
తప్పులు చేసిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కపిల్ సిబల్ అన్నారు.