రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..

12 Nov, 2016 12:53 IST|Sakshi
రెస్టారెంట్‌లో ప్రియురాలికి నిప్పుపెట్టాడు..

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ప్రియురాలితో గొడవపడి ఆమెకు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇరాన్‌ సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఫిలిపిన్స్‌కు చెందిన మహిళ (36)తో కలసి ఉత్తర టోక్యోలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు వాదులాడుకుని గొడవపడ్డారు. ఆయన గాళ్‌ ఫ్రెండ్‌పై లిక్విడ్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా మంటలకు తగిలాయి. రెస్టారెంట్‌లో పనిచేస్తున్నవారు వెంటనే అంబులెన్స్‌కు ఫో​న్‌ చేశారు. మంటలను ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ జంటకు పలుచోట్ల గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి ఉన్న వీరికి చికిత్స అందిస్తున్నారు. కాగా రెస్టారెంట్‌లో ఇతరులకు ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్పారు. హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు