మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ

21 Mar, 2023 00:54 IST|Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలోని నిరుద్యోగ మై నార్టీ యువతకు ట్యాలీ అకౌంటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 36 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం(గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా) ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు ఆధార్‌తో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఇంటర్మీడియెట్‌ విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 23న సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు