అబుల్‌ కలాం ఆజాద్‌కు నివాళి

12 Nov, 2023 01:30 IST|Sakshi

సాక్షి, పాడేరు: భారతదేశ మొదటి విద్యా శాఖమంత్రి దివంగత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి పురష్కరించుకుని శనివారం మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ముస్లిం మత పెద్దలంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్‌ విద్యావ్యవస్థలో అనేక మార్పులు చేపట్టిన ఆయన విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశారన్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను ముస్లిం మత పెద్దలు శాలువాతా ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబేద్కర్‌, మైనారిటీ సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.ఎ.రహీమ్‌, ఏవో వీఎస్‌ఎన్‌ శర్మ, డీపీవో జయప్రకాష్‌,అరకులోయ మసీదు అధ్యక్షుడు గులాం హైదర్‌ అలీ, పద్మాపురం వార్డు సభ్యుడు షేక్‌ యాిసీన్‌, అబ్దుల్‌ రెహమాన్‌, హఫీజ్‌ మహ్మద్‌సాహెబ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు