బ్లాక్‌ మార్కెట్‌కు హాస్టల్‌ బియ్యం

12 Nov, 2023 01:30 IST|Sakshi
స్థానికులు పట్టుకున్న హాస్టల్‌ బియ్యం

డుంబ్రిగుడ: హాస్టల్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా గుట్టురట్టయింది. ఆటోలో తరలిస్తుండగా బస్తా జారిపడటంతో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. మూడు రోజులు సెలవు కావడంతో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన వర్కర్లు శనివారం ఉదయం ప్రైవేట్‌ ఆటోలో నాలుగు బస్తాల బియ్యాన్ని తీసుకుని మార్కెట్‌కు బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తరువాత అరకు–పాడేరు ప్రధాన రోడ్డులో బియ్యం బస్తా జారిపడింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని ఆర్‌ఐ హరికి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్‌ఏ బాలయ్యకు బియ్యం బస్తాను అప్పగించారు. బియ్యం తరలింపుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని స్థానికులకు ఆర్‌ఐ తెలిపారు. దీనిపై హాస్టల్‌ వార్డెన్‌ను వివరణ కోరగా దీపావళి పండుగ నిమిత్తం హాస్టల్‌ వర్కర్లకు నాలుగు బస్తాలు ఇచ్చినట్టు చెప్పారు.

ఆటోలో తరలిస్తుండగా జారిపడిన బస్తా

పట్టుకున్న స్థానికులు

దర్యాప్తు చేపట్టిన ఆర్‌ఐ హరి

మరిన్ని వార్తలు