● జిల్లా అగ్నిమాపకశాఖ అధికారిలక్ష్మణసాయి
పాడేరు రూరల్ : దీపావళి పండగ సందర్భంగా బాణసంచా అమ్మకాలకు జిల్లాలో 90 దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి లక్ష్మణసాయి తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం ఉండలని, ప్రతీ దుకాణం వద్ద డ్రమ్ములతో నీరు, బకెట్లతో ఇసుక అందుబాటులో ఉంచాలని దుకాణదారులను ఆదేశించినట్టు చెప్పారు. దుకాణాల వద్ద నో స్మోకింగ్ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.