ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

14 Mar, 2022 13:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్‌ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్‌ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.

మరిన్ని వార్తలు