ఎన్‌హెచ్‌ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ

5 Oct, 2022 08:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌) ద్వారా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. 

కేంద్ర రహదారి రవాణా, హైవేస్‌ శాఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ఎన్‌హెచ్‌ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్‌ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది.

కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్‌ అధికారి ఇటీవల వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు