తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి

25 Apr, 2021 07:33 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు తిరుపతిలో బీభత్సం సృష్టించింది. కార్నాల వీధిలో బస్సు అదుపు తప్పి రోడ్డు మీద వెళుతున్న బైకుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి అక్కడికక్కడే చెందారు. మూడు బైకులు ధ్వంసం అ‍య్యాయి. బస్సు తిరుపతి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
చదవండి: సినిమాలో ఆఫర్‌ కోసం.. గొంతుకోసుకుని

మరిన్ని వార్తలు