రజకుల సమస్యలను పరిష్కరించాలి

27 Mar, 2023 04:34 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

ముషీరాబాద్‌: రజకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఎంబీసీ చైర్మన్‌ని రజకులకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో తెలంగాణ గాడ్గే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపూరే బ్రహ్మయ్యను ఆర్‌.కృష్ణయ్య ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య, పెద్దవైరే బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా రజకులకు ప్రభుత్వం వల్ల పూర్తిగా న్యాయం జరగలేదని రజకుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాల బాట చేపడితే గానీ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. తెలంగాణ గాడ్గే రజక సంఘం ఉపాధ్యక్షుడిగా గుండ్రనరం చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా వడినాల మడివేలు, ట్రైజరుగా నిరంజన్‌, జాయింట్‌ సెక్రటరీగా మహేందర్‌ తదితరులను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు