ట్రక్కుని ఢీ కొట్టిన మినీ బస్సు.. 12 మంది మృతి

15 Oct, 2023 09:00 IST|Sakshi

ముంబయి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ మినీ బస్సు ఓ కంటైనర్‌ను ఢీ కొట్టిన ఘటనలో 12 మంది మరణించారు. దాదాపు 23 మంది గాయాలపాలయ్యారు. ఛత్రపతి శంభాజీ నగర్‌ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ‍అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ఘటన జరిగింది. 

35 మందితో ప్రయాణిస్తున్న మినీ బస్సు సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి ప్రయాణిస్తుండగా ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో వైజపూర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అదుపుతప్పి కంటైనర్‌ను వెనక భాగంలో ఢీకొట్టాడు. 

ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో 5గురు పురుషులు, 6గురు మహిళలు కాగా ఓ మైనర్‌ బాలిక కూడా ఉంది. 23  మంది క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలిచారు. మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్‌: భారత్‌కు చేరిన మూడో విమానం

మరిన్ని వార్తలు