● ఒకరు మృతి
మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీ ప్రధాన రహదారిలో గురువారం అర్థరాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో అక్కడిక్కడే ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రమాదంలో కలిమెల సమితి భువనపల్లి పంచాయతీ ఎంవీ 115 గ్రామానికి చెందిన బిప్లబ్ మండల్ (26) మృతి చెందాడు. మరో వ్యక్తి చందన్ మండాల్కు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరూ కలిసి ఎంవీ 55 గ్రామంలో జరుగుతున్న కాళీపూజ చూసుకొని పోడియ వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ వారి బైక్ను ఢీకొంది. దీంతో వెంటనే ఢీకొన్న వ్యక్తి పరారయ్యాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గాయపడినవారిని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే బిప్లబ్ మండల్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని కలిమెల ఐఐసీ సత్యానంద్ తెలియజేశారు.