కాశీబుగ్గ: ఇద్దరిదీ ఈ ప్రాంతం కాదు. ఎందుకు వచ్చారో, ఏం జరిగిందో తెలీదు. పలాస రైల్వే స్టేషన్లో దిగారు. పాప్కార్న్ కొన్నారు. స్టేషన్లోనే నవ్వుతూ, తుళ్లుతూ తిరిగారు. కాసేపు అక్కడున్న బెంచీలపై కూర్చుని మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో గానీ అమ్మాయి గూడ్స్ రైలు కింద పడి చనిపోయింది. దాన్ని ఆపేందుకు ప్రయత్నించిన అబ్బాయి విఫలమై రైలు పట్టాలపై తలపెట్టి ప్రాణాలు అర్పించాడు. పలాస రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి జరిగిన సంచలనంగా మారింది. పలాస జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన రంజన్ రాయ్ అనే యువతి, తుషారింగ్ తాషీ షెర్పా అనే యువకుడు శుక్రవారం పలాస స్టేషన్లో దిగారు. నవ్వుతూ మాట్లాడుకుంటూనే మూడో నంబర్ ప్లాట్ఫారంపై నుంచి పట్టాలపైకి దిగారు. ముందు రంజన్ రాయ్ గూడ్స్ రైలు కింద తలపెట్టి చనిపోయింది. ఆమెను ఆపలేకపోవడంతో యువకుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మృతదేహాలను పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో మార్చురీ విభాగానికి తరలించారు.
యువ జంట ఆత్మహత్య
Published Sat, Nov 18 2023 12:36 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
పన్నూ హత్యకు కుట్ర.. అమెరికాపై మండిపడ్డ రష్యా
పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల సభ
10 వరకూ తత్కాల్లో ఇంటర్ ఫీజుకు అవకాశం
అర్ధరాత్రి పచ్చమూకల బరి తెగింపు
ప్రతిభ ఉంటే.. ఉపకారం మీ వెంటే
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సమస్యాత్మక ప్రదేశాల్లో 800 సీసీ కెమెరాలు
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
సజావుగా పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement