Vice Presidential Elections 2022: ప్రధాని సమక్షంలో నామినేషన్‌ వేసిన జగదీప్‌ ధన్‌కర్‌

18 Jul, 2022 13:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన నామినేషన్‌ సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరుల ధన్‌కర్‌ వెంట ఉన్నారు.

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా ఇంకా నామినేషన్‌ దాఖలు చేయలేదు. మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది.

మరిన్ని వార్తలు