Womens T20 Challenge: పుణే వేదికగా మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ

4 May, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్‌ క్రికెట్‌ టోర్నీ వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ లక్నోలో కాకుండా పుణేలో ఈనెల 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు.

గత నెలలో బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ లక్నోలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ టోర్నీ వేదికను లక్నో నుంచి పుణేకు మార్చారు.

చదవండి: Rishi Dhawan Vs Hardik Pandya: గుజరాత్‌ కెప్టెన్‌కు రిషి ధవన్‌ ఫ్లైయింగ్‌ కిస్‌; నిరాశలో హార్దిక్‌ భార్య

 

మరిన్ని వార్తలు