'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు'

22 Dec, 2020 11:42 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా సమయంలో వార్నర్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన భార్య, పిల్లలతో కలిసి ఇండియన్‌ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను తీసుకొని చాలా ఫన్నీ వీడియోలు రూపొందించాడు. అప్పట్లో వార్నర్‌ చేసిన ప్రతీ వీడియోకు మంచి క్రేజ్‌ ఏర్పడింది.

తాజాగా వార్నర్‌ తన ముగ్గురు కూతుర్లు బ్యాట్‌ పట్టుకొని ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో ఇవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌లు బ్యాట్‌ను పట్టుకొని నవ్వుతూ ఫోటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటో గురించి మీరేమనుకుంటున్నారో క్యాప్షన్‌ రాయండి అంటూ కామెంట్‌ చేశాడు.  దీనిపై నెటిజన్లు 'మీ ముగ్గురు కూతుళ్లు తెగ ముద్దొచ్చేస్తున్నారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : ఒక్క ఓవర్‌.. ఐదు వికెట్లు.. సూపర్ కదా‌)

కాగా డేవిడ్‌ వార్నర్‌ టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో గాయపడ్డాడు. దీంతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న వార్నర్‌ మొదటి టెస్టు మ్యాచ్‌లోనూ ఆడలేదు. వార్నర్‌ ఫిట్‌గా ఉంటే డిసెంబర్‌ 26 నుంచి మొదలుకానున్న బాక్సింగ్‌ డే టెస్టులో ఆడే అవకాశం ఉంది.. ఫిట్‌గా లేకపోతే మాత్రం కొత్త ఏడాదిలో సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో పాల్గొంటాడు. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో అతని స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మాత్రం మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఇక తొలి టెస్టులో దారుణంగా విఫలమైన పృథ్వీ షా స్థానంలో కేఎల్‌ రాహుల్‌ , శుబ్‌మన్‌ గిల్‌లో ఎవరో ఒకరు తుది జట్టులోకి రానుండగా.. గాయపడిన షమీ స్థానంలో నవదీప్‌ సైనీ లేదా సిరాజ్‌ ఆడనున్నాడు.(చదవండి : జడేజా కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నాడా!)

మరిన్ని వార్తలు