Vietnam Open 2022: భారత్‌కు నిరాశ.. సిక్కిరెడ్డి- రోహన్‌ కపూర్‌ జోడీకి తప్పని ఓటమి

2 Oct, 2022 09:40 IST|Sakshi
సిక్కిరెడ్డి(PC: BAI Media Twitter)

Vietnam Open 2022- హో చి మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలో మిగిలిన ఏకైక జోడీ సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) సెమీఫైనల్లో వెనుదిరిగింది.

37 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ రెహాన్‌ నౌఫల్‌–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం 21–16, 21–14తో సిక్కి రెడ్డి–రోహన్‌ జోడీపై గెలిచి ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో ఓడిన భారత జంటకు 1,050 డాలర్ల (రూ. 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

>
మరిన్ని వార్తలు