పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్‌

29 Jan, 2023 21:41 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: మేడిపల్లిలోని  పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్‌ఎస్‌ నేతలు, డిప్యూటీ మేయర్‌ అడ్డంగా దొరికిపోయారు. బీఆర్‌ఎస్‌ నేతలంతా పీర్జాదిగూడ డ్యిప్యూటీ మేయర్‌ శివకుమార్‌ ఆఫీస్‌లో ఆడుతూ పట్టుబడినట్లు సమాచారం.

దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌ గౌడ్‌ తోపాటు ఏడుగురు కార్పోరేటర్లను, ఆరుగురు బిల్డర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు. 

మరిన్ని వార్తలు