రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి 

23 Nov, 2022 01:25 IST|Sakshi

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ట్రెసా విజ్ఞప్తి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ను కలిసి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు