విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్ –19 స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లు శుక్రవారం బయలుదేరాయి. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న బాల, బాలికల సైక్లింగ్ పోటీలతో పాటు గుంటూరు వేదికగా జరగనున్న సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయి. ఈ సందర్భంగా అండర్–19 స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి పీవీఎల్ఎన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాఽధించిన క్రీడాకారులు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనకబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ అధ్యాపకులు, జట్ల కోచ్ అండ్ మేనేజర్లు పాల్గొన్నారు.